byసూర్య | Tue, May 28, 2024, 10:16 AM
లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన దిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవోలు పాల్గొన్నారు.