byసూర్య | Tue, May 28, 2024, 10:14 AM
మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని అపహరించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ తమ వాహనాలు పక్కకు నిలిపి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైయ్యాడు. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని పక్కకు పంపించారు. తర్వాత చూస్తే పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. కోదండపురం ఓ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం ఆగి ఉండగా పోలీసులు గుర్తించారు.