ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. బాధితుల లిస్టులో బడా నేతలు, ఆయన ఆదేశాలతోనే

byసూర్య | Mon, May 27, 2024, 07:23 PM

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు పోలీసు కస్టడీలో ఉన్నారు. తాజాగా.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు విచారణ సందర్భంగా తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వెల్లడించారు. సొంత పార్టీ నేతలపై కూడా నిఘా ఉంచాలని బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న అప్పటి మంత్రి ఆదేశించినట్లు చెప్పారు.


 కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్యకు విభేదాలు ఉండటంతో వారి ఫోన్లు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా ఉంచినట్లు చెప్పారు. అలాగే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా ఉంచినట్లు రాధాకిషన్‌ రావు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్ల ట్యాప్ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ల ట్యాప్ చేసినట్లు చెప్పారు.


బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. మీడియా యజమానుల ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వీఐపీల సమాచారాన్ని డీఎస్పీ ప్రణీత్‌ రావుకు ఓ మీడియా యజమాని అందించినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని కూడా టార్గెట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్ చాట్‌లో మాట్లాడిన వారి వివరాలను సేకరించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM