byసూర్య | Mon, May 27, 2024, 07:20 PM
ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన ఆరే మహేష్ గౌడ్ (21) అనే వ్యక్తి ఈ నెల 25న కడుపు నొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఆరే సత్తయ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై టి. సత్యనారాయణ తెలిపారు.