byసూర్య | Mon, May 27, 2024, 05:30 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల నేపథ్యంలో సోమవారం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్ లో ఎమ్మెల్యే వేముల వీరేశం సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నియెజకవర్గ పరిధిలోని ప్రతి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.