byసూర్య | Mon, May 27, 2024, 05:28 PM
దేవరకొండ మండల పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సిఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమటిపల్లికి చెందిన అరుణ్, మధులు దేవరకొండకు వస్తుండగా మార్గమధ్యలో కర్నాటిపల్లి స్టేజి వద్ద బొలెరో వాహనం అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో బైక్, బోలోరో వాహనాన్ని ఢీ కొట్టడంతో మధు(22) మృతి చెందగా.. అరుణ్ కు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే బాలు నాయక్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని పరామర్శించారు.