byసూర్య | Mon, May 27, 2024, 02:48 PM
నేడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు.