byసూర్య | Mon, May 27, 2024, 01:56 PM
సిద్దిపేట నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు గౌరీ సహిత నీలకంఠేశ్వర స్వామి కల్యాణోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. నీలకంటేశ్వర ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టామని నీలకంఠ సమాజం అధ్యక్షుడు గుండ్ల యోగేశ్వర్, కడవేర్గు రాజులు అన్నారు. గణపతి పూజతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు బుధవారం రోజు జరిగే గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవముతో ముగుస్తుందన్నారు.