byసూర్య | Mon, May 27, 2024, 11:16 AM
వర్గల్ మండలం లోని శ్రీ విద్యాధర క్షేత్రంలో ఆదివారం మూల నక్షత్ర విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, చిన్నారుల అక్షరస్వీకరాల పూజలతో క్షేత్రం శోభిల్లింది. పుష్పార్చన, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆలయ వ్యవస్థాపకుడు, చైర్మన్ శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మూల మహోత్సవానికి అంకురార్పణ చేశారు.