byసూర్య | Mon, May 27, 2024, 11:07 AM
ఏపీని రెండు ముక్కలుగా 2014లో విభజించినప్పుడు అప్పటివరకూ రెండు ప్రాంతాలకూ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బందిపడకుండా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం చెబుతోంది. దీంతో ఈసారి జూన్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది.