byసూర్య | Sun, May 26, 2024, 10:12 PM
టాలీవుడ్ హీరో తొట్టెంపూడి వేణుపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థతో పాటు ఓ ప్రజా ప్రతినిధిపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బంజారాహిల్స్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ ఫిర్యాదు మేరకు మొత్తం ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్లో హైడ్రో ఎలక్ర్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కాంట్రాక్ట్ను తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీహెచ్డీసీ) ద్వారా ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన పనులను బంజారాహిల్స్కు చెందిన స్వాతి కస్ట్రక్షన్స్తో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్కు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్ని కారణాల వల్ల ఈ కాంట్రాక్ట్ నుంచి స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే తప్పుకుంది. రిత్విక్ ప్రాజెక్ట్స్ మాత్రం పనులు కొనసాగించింది. దీంతో ఈ పనులకు సంబంధించి తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇందులో 5.5 శాతం డబ్బును ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ తీసుకుంది. మిగిలిన 94.5 శాతం డబ్బును రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసింది.
కొన్ని కారణాల వల్ల జరిగిన వివాదంతో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ, తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించటంతో రూ.1,010 కోట్లు విడుదలయ్యాయి. అ డబ్బును ఈ రెండు సంస్థల జాయింట్ అకౌంట్లోకి జమ అయ్యాయి. ఒప్పందం ప్రకారం ఈ డబ్బులను వాటాల వారీగా తీసుకోవాల్సి ఉంది. అయితే తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్తో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఒప్పంద హక్కులను రద్దు చేసుకుంది. అటు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న రిత్విక్ ప్రాజెక్టుతో సైతం ఒప్పంద హక్కులను రద్దు చేసింది. దీంతో రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి. రవి కృష్ణ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
మొత్తం డబ్బులను ప్రోగ్రెసివ్ సంస్థ తీసుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఒప్పందం రద్దు చేసిందని ఫిర్యాదు చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న కావూరి భాస్కర్రావుతో పాటు మరో ప్రజాప్రతినిధి, హీరో వేణు, పీసీఎల్ సంస్థ డైరెక్టర్ కె. హేమలత, భాస్కర్ రావు సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్పై ఫిర్యాదు చేశారు. దీంతో హీరో వేణుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.