byసూర్య | Wed, May 22, 2024, 08:17 PM
పీఏపల్లి మండలం హైదరాబాద్ కు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 20 నుంచి పుట్టంగండి జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన 10 మోటార్ల ద్వారా గ్రావిటీ కాల్వలో నీటిని ఎత్తిపోసి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గ్రావిటీ కాలువలోకి నీరు ఎత్తిపోస్తున్నప్పుడు వెనక్కి వచ్చే నీటిని అడ్డుకునేందుకు జీరో పాయింట్ వద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో కట్టను నిర్మిస్తున్నారు.