byసూర్య | Tue, May 21, 2024, 08:56 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బి. సి కులగణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బి. సి. పొలిటికల్ జేఎసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అరవింద్ చారి మంగళవారం డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిసి జనాభా లెక్కలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట తప్పితే ఊరుకోమని హెచ్చరించారు.