మనవడి మెుక్కు.. తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, May 21, 2024, 08:41 PM

తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గతంలో ఆయన చాలా సార్లు తిరుమలకు వెళ్లగా.. సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకోవటం ఇదే తొలిసారి. మనవడి పుట్టు వెంట్రుకల మెుక్కు ఉండటంతో.. కుటుంబంతో సహా రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్న సీఎం.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ రాత్రికి గానీ.. బుధవారం ఉదయం గాని స్వామివారిని దర్సించుకోనున్నారు. నేటి నుంచి తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం కాగా.. రేవంత్ పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం అనంతరం బుధవారం ఉదయమే ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.


రాజీవ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, సీనియర్ నేతలు జానారెడ్డి, వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నేడు మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లో పరిశ్రమల భవన్‌లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం ఆయన తిరుమలకు పయనం కానున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM