ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు,,,,బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్

byసూర్య | Fri, May 10, 2024, 07:47 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావుపై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో పైరయ్యారు. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం.. చేస్తానని బోయినపల్లి వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా ? అని సవాల్ విసిరారు.


'కేసీఆర్.. నన్ను ఓడించేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా ? హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా ? 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా ? హిందువులారా.... మీ సత్తా ఏందో కేసీఆర్‌కు మళ్లీ రుచి చూపించండి కేసీఆర్... నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా... వినోద్ ఓడిపోతే... బీఆర్ఎస్ పార్టీని మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా ? నా వెనుక 80 శాతం హిందువులున్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండి. కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు.


కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా? కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు కేసీఆర్. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్నాడు.


తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్‌తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నరు. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు.


సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా ? విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా ? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది ? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది.' అని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM