byసూర్య | Thu, May 09, 2024, 01:00 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనమంతా జై కొట్టారు. కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది కచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న మాత్రమేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వార్డు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి వేదిత సాయన్న ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. నేతాజీ నగర్, న్యూ బోయిన్ పల్లి, కడక్ పురలో క్యాంపెయిన్ చేశారు. ఈ ప్రచారానికి జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది. ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనం అంతా ప్రతిన బూనారు.