ఇంటర్ ఫెయిల్ కావటంతో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. బాధను తట్టుకోలేక తండ్రి సూసైడ్

byసూర్య | Tue, May 07, 2024, 09:46 PM

హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫెయిల్ కావటంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. ఆ బాధను తట్టుకోలేని తండ్రి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమార స్వామికి (47), రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది. ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసినా.. పాస్ కాలేదు. దీంతో తండ్రి కూతురిని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపగించుకోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.


గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే పరకాలలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని కుమారస్వామి మనస్థాపం చెందాడు. ఇక తాను బతికిఉండి లాభం లేదని భావించి.. పరకాలలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపువెళ్లి పురుగుల మందు సేవించి మృతి చెందాడు. ఓ వైపు కూతురు చావుబతుకుల మధ్య కొట్టామిట్టాడుతుండటం.. మరోవైపు తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM