ప్రభుత్వానికి గూఢచారులుండటం సహజం, కాకపోతే.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ కీలక కామెంట్స్

byసూర్య | Tue, May 07, 2024, 09:51 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా.. పలు పార్టీల నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలు సాధించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించారని మండిపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాగా.. విచారణ కొనసాగుతోంది. ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలక ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు.


ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఓ ప్రముఖ మీడియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమని అన్నారు. సీఎం, ఇతర మంత్రుల చేతికి ఆ రిపోర్ట్‌లు వస్తాయని.. కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేలా తెలుస్తుందని అన్నారు. అది తమ పరిధిలోకే రాదని.. ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని తాను అనుకోలేదని చెప్పారు.


తమ పదేళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించామని.. ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్‌ రాచిరంపాన పెట్టిందని మండిపడ్డారు. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండమన్న సీఎం రేవంత్ తోక ముడిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి వస్తుందని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరనుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వంలో తాము కీ రోల్ పోషిస్తామన్నారు. ప్రధాని మోదీ వికృతరూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని కేసీఆర్ ఫైరయ్యారు. ఆడబిడ్డ అని చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా తన కుమార్తె కవితను జైళ్లో పెట్టించారనన్నారు. మోదీ వికృత పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు.


Latest News
 

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM
పీడీఎస్ బియ్యం పట్టివేత Sun, May 19, 2024, 06:18 PM
మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM