byసూర్య | Mon, Apr 22, 2024, 01:38 PM
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల తేదీలోపే వెల్లడించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని పూర్తి చేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది.