byసూర్య | Mon, Apr 22, 2024, 12:11 PM
అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. కట్టంగూర్ మండల పరిధిలోని కలిమెర గ్రామంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలసి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.