byసూర్య | Mon, Apr 22, 2024, 12:09 PM
బీజేపీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలని శాలిగౌరారం మండల బిజెపి అధ్యక్షుడు జమ్మూ రమేష్ అన్నారు. మండల పరిధిలోని వంగమర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.