byసూర్య | Mon, Apr 22, 2024, 12:07 PM
ఉమ్మడి జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్య మవుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన 30 మంది రాచమల్ల శ్రీను ఆధ్వర్యంలో సంకినేని రవీందర్ రావు, కాపు రవి, మండల పార్టీ అధ్యక్షుడు జమ్ము రమేష్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్లే రాములు, సుంకరి అంతయ్య, సిగ అన్నపూర్ణ, యాదగిరి పాల్గొన్నారు.