byసూర్య | Sun, Apr 21, 2024, 04:08 PM
వచ్చే నెలలో జరగనున్న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో బిఆర్ ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీగా మూడోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేకసార్లు పార్లమెంటులో తన గొంతు వినిపించానని, మరో అవకాశం ఇస్తే మరిన్ని సమస్యల పరిష్కారం కృషి చేస్తానన్నారు.