byసూర్య | Sun, Apr 21, 2024, 03:06 PM
హైదరాబాద్, పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్ చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హెచ్చరించారు. ఆదివారం ఐఎస్సదన్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలకు ఒవైసీ చేసిన న్యాయం ఏమిలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సారి హైదరాబాద్ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జంగం శ్వేతామధుకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, నేతలు మన్నె శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.