byసూర్య | Sun, Apr 21, 2024, 02:42 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సమాగ్రి జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక వాహనంలో సాయిధ పోలీసుల బందోబస్తు నడుమ శనివారం రాత్రి దేవరకొండకు చేరాయి. సామాగ్రిని ఆర్డిఓ శ్రీరాములు పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో స్థానికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి గిరిబాబు తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.