byసూర్య | Sun, Apr 21, 2024, 01:59 PM
రామంతపూర్ ప్రధాన రహదారి పెద్ద చెరువు ఎదురుగా ఉన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఉన్న మూడు హుండీలు చోరీకి గురి అయినట్టు ఆదివారం ఆలయ చైర్మన్ బండారు వెంకట్ రావు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి హుండీ డబ్బులను లెక్కిస్తామని, మంగళవారం నుండి కట్టమైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సంఘటన జరగడంతో కమిటీ సభ్యులు దిగ్భ్రాంతికి గురి అయ్యారని పేర్కొన్నారు.