ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం,,,,స్పాట్‌లోనే ఇద్దరు మృతి

byసూర్య | Sun, Apr 14, 2024, 04:19 PM

హైదరాబాద్‌లో రహదారులు నెత్తురోడుతున్నాయి. శనివారం వనస్థలిపురం పీఎస్ పరిధిలోని గుర్రంగూడ చౌరస్తాలో రెండు కార్డు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా.. మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. ఇద్దరు స్పాట్‌లోనే కన్నుమూశారు. అతివేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.


ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి పోలీస్ అకాడమీ వైపు కారు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన ముగ్గుర్ని శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక రోడ్డు ప్రమాదంతో ఔటర్ రింగ్ రోడ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా కారు నిలిచిపోవటంతో వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.


Latest News
 

గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM