byసూర్య | Sun, Apr 14, 2024, 04:00 PM
కృష్ణాజిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్ పై జరిగిన దాడిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కంటిపై గాయం కావడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన వెల్లడించారు.