byసూర్య | Sun, Apr 14, 2024, 03:16 PM
అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ ఎం. రాజారాం కొనియాడారు. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుక ఆదివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంగోపాల్, కృష్ణయ్య, శ్రీధర్ గౌడ్, పీఈటీ సుగుణాకర్, ఆర్ట్ టీచర్ గోపినాయక్, రుక్మిణి, జైవీర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అంబేద్కర్ సేవలను విద్యార్థులకు తెలియజేశారు.