byసూర్య | Sun, Apr 14, 2024, 03:14 PM
భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించడానికి కృషి చేస్తామని బిఎస్ఐఎఫ్ అధ్యక్షులు జుట్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ము జాన్సన్ బాబు అన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. గుజ్జుల బిసన్న నాయుడు, కేశవులు, అశోక్, రమేష్, అజయ్ యాదవ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.