byసూర్య | Sun, Apr 14, 2024, 03:12 PM
మరికల్, ధన్వాడ మండల కేంద్రాలల్లో ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.