byసూర్య | Sun, Apr 14, 2024, 03:11 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈయాసంగిలో 370 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77, 783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. శనివారం నాటికి 12 కోట్ల 66 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.