byసూర్య | Sun, Apr 14, 2024, 03:09 PM
నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో తైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్టు తరఫున ట్రైనింగ్ కిట్లను అందజేసిన గుత్తా అమిత్ రెడ్డి. అనంతరం శిక్షణా క్లాసులను ప్రారంభించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చిన్నారులు తైక్వాండోలో రాణించి నల్గొండ జిల్లాతోపాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.