byసూర్య | Sun, Apr 14, 2024, 03:19 PM
కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో బిఆర్ అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ యడ్మసత్యం అంబేద్కర్ విగ్రహానికి పులామాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి అంటరానితనాన్ని నిర్మూలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షాహెద్, శ్రీశైలం, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్, కౌన్సిలర్స్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.