byసూర్య | Fri, Apr 12, 2024, 04:26 PM
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ మణిపాల్ రెడ్డిలతోపాటు పలువురు ఎంపిటిసిలు, పలువురు మాజీ సర్పంచ్ లు ఇతర నేతలు, కార్యకర్తలు గురువారం ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. నేడో, రేపో కాంగ్రెస్ ఉద్దండుడు జానారెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.