byసూర్య | Fri, Apr 12, 2024, 11:15 AM
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.