byసూర్య | Fri, Apr 12, 2024, 11:31 AM
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. గురువారం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని ఆరోపిస్తూ కవిత తరఫు లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.