byసూర్య | Fri, Apr 12, 2024, 10:07 AM
పాత్రికేయులకు లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ ఉన్న పాత్రికేయులు ఫారం 12డి అవసరం ఉన్నవారు అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీని డిపిఆర్ఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈనెల 15లోగా ఫారాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు.