byసూర్య | Thu, Apr 11, 2024, 10:59 PM
మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జ్యోతిబాపులే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం అనితరసాధ్యమైన రీతిలో కొనసాగించిన కృషిని గుర్తు చేసుకున్నారు.