byసూర్య | Thu, Apr 11, 2024, 11:01 PM
తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంను గురువారం సాయంత్రం మధిరలోని ఆయన నివాసంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం బీ. ఆర్. ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని రామనాథంను నామ కోరారు. అలానే టీడీపీ పార్టీతో ఉన్న జ్ఞాపకాలను మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు