byసూర్య | Thu, Apr 11, 2024, 10:58 PM
ఉమ్మడి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు జీవీకే మనోహర్ రావు గురువారం బీజేపీలో చేరారు. ఆయన నాయకత్వంలో సుమారు వెయ్యి మంది వివిధ నాయకులు పార్టీలో చేరారు. వారికి గురువారం ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రావు మాట్లాడుతూ.. తిరిగి సొంత గూటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేస్తానన్నారు.