byసూర్య | Thu, Apr 11, 2024, 10:58 PM
పెనుబల్లి మండలం వీఎం బంజరులోని సప్తపది ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సాయంత్రం 4గంటలకు మండల బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు హాజరుకానున్నారని చెప్పారు. కాగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.