byసూర్య | Thu, Apr 11, 2024, 10:52 PM
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉన్నారు.