byసూర్య | Thu, Apr 11, 2024, 10:52 PM
పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా కల్లూరు పట్టణం పుల్లయ్య బంజర్ రోడ్ లోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.