byసూర్య | Thu, Apr 11, 2024, 10:23 PM
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించారు. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు.