byసూర్య | Thu, Apr 11, 2024, 11:41 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ లో గురువారం మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్న మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ వారు చేసిన సేవలను కొనియాడారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.