byసూర్య | Tue, Apr 09, 2024, 12:42 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి మాజీ కోఆప్షన్ సభ్యుడు వహబ్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి పాల్గొని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథి హాజరయ్యారు.