సమ్మర్‌లో తిరుపతి వెళ్తున్నారా..? శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్

byసూర్య | Mon, Apr 08, 2024, 07:01 PM

సమ్మర్‌లో సాధారణంగా విద్యార్థులకు హాలీడేస్ ఉంటాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు సొంతూళ్లకు, తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తూ ఉంటారు. తెలంగాణ నుంచి తిరుపతి వేళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతితో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ట్రైన్లు నడుపుతోంది.


కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ఈ ప్రత్యేక ట్రైన్లు నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాచిగూడ-తిరుపతి (ట్రైన్ నెంబర్ 07653)కి ఏప్రిల్‌ 11, 18, 25 మే 2 తేదీల్లో.. తిరుపతి-కాచిగూడ (ట్రైన్ నెంబర్ 07654)కి ఏప్రిల్‌ 12, 19, 26, మే 3 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయని వెల్లడించారు.


ఇక సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ (ట్రైన్ నెంబర్ 07170) ఏప్రిల్‌ 13, 20, 27 తేదీల్లో, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 07169) ఏప్రిల్‌ 14, 21, 28 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు ఉపయోగించుకోవాలని సూచించారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM