byసూర్య | Fri, Mar 29, 2024, 11:10 AM
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని మార్కెట్ కు సెలవు ప్రకటించామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మార్చి 30 వ తేదీ నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.