byసూర్య | Thu, Mar 28, 2024, 04:32 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి,
అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించి సత్వరమే హద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని లేఅవుట్లను తనిఖీ చేసి ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.